మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జారీ సమన్లకు వ్యతిరేకంగా జీ ఎంటర్టైన్మెంట్ ఛైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్రకు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. మార్చి 27న సెబీ నోటిసుల ప్రకారం మాత్రమే తమ వద్ద ఉన్న సమాచారం లేదా పత్రాలను అందించాలని సూచించింది. జనవరి 12న జారీ చేసిన సమన్లను విస్మరించవచ్చని తెలిపింది. సమన్లు సెబీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా లేవని.. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది.
సమన్లు చెల్లవని.. చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు. సమన్లు పక్షపాతంగా, అన్యాయంగా, ఏకపక్షంగా, ముందుగా నిర్ణయించినవని ఆయన ఆరోపించారు. జనవరి 12 సమన్లకు చంద్ర స్పందించనందున దర్యాప్తును నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారని సెబీ ఆరోపించింది. ఈ పిటిషన్ను బాంబే హైకోర్టు విచారణ చేపట్టగా.. రిట్ పిటిషన్లో లేవనెత్తిన అంశాలను సెబీ అంగీకరించింది. జనవరి 12, 2024 నాటి సమన్లకు ప్రతిస్పందించవద్దని డాక్టర్ చంద్రకు కోర్టు సలహా ఇచ్చింది.
పక్షపాతానికి సంబంధించిన అవకాశాలను తొలగించేందుకు.. ఈ అంశాన్ని మరో సెబీ అధికారికి చేరవేస్తామని సెబీ హైకోర్టుకు తెలిపింది. సెబీ హోల్ టైమ్ మెంబర్ అశ్వనీ భాటియా నుంచి కాకుండా ఇతర పూర్తికాల సభ్యుని తరుఫున తుది ఉత్తర్వు జారీ చేయిస్తామని సెబీ తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Subhash Chandra SEBI Bombay High Court
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »