ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో కుంగిపోయిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఎన్నికలపై వరుస సమీక్ష చేస్తున్న వైఎస్ జగన్ గురువారం ఎమ్మెల్సీలతో సమావేశమయయారు. అసెంబ్లీలో సంఖ్యా బలం 11 మాత్రమే ఉండడంతో అక్కడ పోరాటం చేసే శక్తి లేని పరిస్థితిలో శాసనమండలిపై జగన్ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు.'ఫలితాలు చూసి నిబ్బరం కోల్పోవద్దు.
'రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారం లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నది కూడా రాజకీయమే' అని జగన్ తెలిపారు. 'అసెంబ్లీలో సంఖ్యా బలం పెద్దగా లేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. గొంతు విప్పనివ్వకపోవచ్చు. కానీ మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి' ఎమ్మెల్సీలకు హితబోధ చేశారు.
'మనల్ని ఎవరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టుగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏం చేయగలుగుతారు?' అని కక్ష రాజకీయాలపై జగన్ పేర్కొన్నారు. 'వారికి ఓటు వేయకపోవడమే పాపం అన్నట్టుగా రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు' అని అసహనం వ్యక్తం చేశారు. 'శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు మొదలయ్యాయి' అని తెలిపారు.'చంద్రబాబు రెండో పాపం కూడా అప్పుడే పండింది. ఎన్డీయేలో కీలకంగా ఉన్న సమయంలో కూడా ప్రత్యేక హోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Jr Ntr
YSR Congress Party Mlc Andhra Pradesh MLC Legislative Council Tadepalli
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »