Ys Jagan Assets: ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నడుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. రెండవ సెట్ నామినేషన్ను స్వయంగా 25వ తేదీన దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.TS Inter Results 2024: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల తేదీ వెల్లడించిన ఇంటర్ బోర్డు..
Ys Jagan Assets: ఏపీలో వివిధ పార్టీలో అభ్యర్ధుల నామినేషన్లతో పాటు సమర్పిస్తున్న ఎన్నికల అఫిడవిట్లలో సంచలన విషయాలు కన్పిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ తరపున పులివెందులలో ఒక సెట్ నామినేషన్ దాఖలైంది. మరో సెట్ను స్వయంగా ఏప్రిల్ 25వ తేదీన జగన్ దాఖలు చేయవచ్చు. వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఓసారి పరిశీలిద్దాం.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది. అంటే ఐదేళ్లలో 41 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ఆస్థి 154 కోట్లు పెరిగినట్టు అఫిడవిట్లో చూపించారు. ఇక కుటుంబ ఆస్థి 2019 నాటికి 510 కోట్లు కాగా ఇప్పుడు 247 కోట్లు పెరిగింది. వైఎస్ జగన్ పేరుతో 529 కోట్ల విలువైన స్థిర, చరాస్థులున్నాయి. కుటుంబంలో ఎవరికీ సొంతంగా కారు కూడా లేదట. చేతిలో ఉన్న నగదు కూడా కేవలం 7 వేల రూపాయలు.
ఇక జగన్ ఇద్దరు కుమార్తెల పేరిట 51 కోట్ల ఆస్థులున్నాయి. ఐదేళ్ల క్రితం ఈ ఇద్దరి పేరిట 11 కోట్ల ఆస్థులున్నాయి. జగన్ భార్య భారతి పేరిట 124 కోట్ల ఆస్థి ఉంది. ఇక ఇడుపులపాయలో జగన్కు 35 ఎకరాల భూమి ఉంది. ఇడుపులపాయ, భాకరాపురం, బంజారాహిల్స్, సాగర్ సొసైటీలో ఆస్థులున్నాయి. వ్యవసాయేతర భూముల విలువ 46 కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. ఇక వైఎస్ భారతి పేరిట 5.5 కోట్ల విలువ చేసే ఆరున్నర కేజీల బంగారం, వజ్రాలున్నాయి.
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »